కౌలు ఎప్పుడు చెల్లిస్తారు: హై కోర్టు
ABN, First Publish Date - 2022-06-15T22:47:51+05:30
అమరావతి: రాజధాని రైతులకు కౌలు చెల్లించాలంటూ దాఖలైన పిటీషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రైతులకు కౌలు ఎప్పుడులోగా చెల్లిస్తారో చెప్పాలని ప్రభుత్వ
అమరావతి: రాజధాని రైతులకు కౌలు చెల్లించాలంటూ దాఖలైన పిటీషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రైతులకు కౌలు ఎప్పుడులోగా చెల్లిస్తారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఏటా రైతులకు కౌలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని పిటీషనర్ తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు కోర్టు దృష్టికి తెచ్చారు. వ్యవసాయం మినహా వేరే వృత్తి చేతకాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో కౌలు ఎప్పుడు చెల్లిస్తారో చెబుతూ కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశిస్తూ విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు.
Updated Date - 2022-06-15T22:47:51+05:30 IST