ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐతో విచారణ జరిపించాలి: సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు

ABN, First Publish Date - 2022-06-24T22:23:52+05:30

అమరావతి: తమ కొడుకు హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తమ కొడుకు హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబును కలిశారు. తమ కుమారుడి హత్య కేసులో పోలీసుల ద్వారా తమకు న్యాయం జరగదని, పోలీసులు ఆనంతబాబుని కేసు నుంచి తప్పించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జరిపించే విచారణ మీద తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయాన్ని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు చంద్రబాబును కోరారు. సీబీఐతో విచారణ జరిపించేలా తనవంతు ఒత్తిడి తీసుకొస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన వారికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేయటంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-06-24T22:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising