‘అమ్మఒడి’ నుంచి తప్పించుకోడానికా ?: నాగబాబు
ABN, First Publish Date - 2022-07-09T02:58:47+05:30
Hyderabad: ఏపీలో పాఠశాలల విలీనంపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. జగన్ సర్కారు తీరును ఎండగట్టారు. జగన్ 8 వేలకు పైగా స్కూళ్లకు తాళాలు వేసి భావి భారత పౌరులకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. ఇలా చేయడం అమ్మఒడి ఫథకం నుంచి తప్పించుకోవడానికా
Amaravathi: ఏపీలో పాఠశాలల విలీనంపై జనసేన పీఎసీ సభ్యుడు నాగబాబు స్పందించారు. జగన్ సర్కారు తీరును ఎండగట్టారు. జగన్ 8 వేలకు పైగా స్కూళ్లకు తాళాలు వేసి భావి భారత పౌరులకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. ఇలా చేయడం అమ్మఒడి ఫథకం నుంచి తప్పించుకోవడానికా ?..లేక టీచర్ పోస్టుల సంఖ్య తగ్గించడానికా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలోనే ఇప్పటికే 711 స్కూళ్లను మూసేశారని చెప్పారు. బడి కోసం పిల్లలను రోడ్డుపై కూర్చోపెట్టిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు.
Updated Date - 2022-07-09T02:58:47+05:30 IST