ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చడం కక్షపూరిత చర్యే: బోండా ఉమ

ABN, First Publish Date - 2022-06-19T14:30:17+05:30

Amaravathi: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం కావడంతో వైసీపీ ప్రభుత్వం ఉలికిపాటుకు గురైంది. టీడీపీ కార్యక్రమాలకు జనం భారీగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం కావడంతో వైసీపీ ప్రభుత్వం ఉలికిపాటుకు గురైంది. టీడీపీ కార్యక్రమాలకు జనం భారీగా వస్తుండడంతో అటు సీఎం జగన్, ఇటు వైసీపీ మంత్రులు, పార్టీ ప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. ప్రజల నుంచి చంద్రబాబుకు లభిస్తున్న మద్దతును చూసి సీఎం జగన్ ఓర్వలేక, టీడీపీ నేతలపై పరోక్షంగా కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆరోపించారు. చోడవరం మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయన ఇంటి గోడను కూల్చడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా 70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. ఎన్ని రకాలుగా అణిచేసే ప్రయత్నం చేసినా లాభం ఉండదన్న విషయాన్ని వైసీపీ మంత్రులు గుర్తించాలన్నారు.  

Updated Date - 2022-06-19T14:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising