ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులను అవమానపరుస్తున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-08-08T05:56:52+05:30

రాష్ట్ర ప్రభుత్వం దళితులను అవమాన పరుస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు ప్రసాద్‌ తుండియా అన్నారు.

ప్రసంగిస్తున్న బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు ప్రసాద్‌ తుండియా

గుంటూరు (సంగడిగుంట), ఆగస్టు 7: రాష్ట్ర ప్రభుత్వం దళితులను అవమాన పరుస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు ప్రసాద్‌ తుండియా అన్నారు. ఆదివారం ఆయన బీజేపీ ఎస్సీ మోర్చా శిక్షణ తరగతులలో పాల్గొన్న ఆయన దళిత సంక్షేమ పథకాలపై మార్గదర్శకం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు కన్నాలక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజేపీ సహకారంతోనే రాజధాని కల సాకారమవుతుందన్నారు. జగన్‌ మేక వన్నె పులి అని,  అదనుచూసి ప్రజలను బలి తీసుకుంటున్నాడని ఆరోపిం చాడు. రాష్ట్రానికి ఈ మూడేళ్ళలో ఒక్క పరిశ్రమ రాలేదని, పైగా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయాయన్నారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. అన్ని రకాల ధరలను విపరీతంగా పెంచాడన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పి తెచ్చిన అప్పులు ఏమైపోయాయని ప్రశ్నించారు. ప్రఽజాధనాన్ని లూటీ చేస్తూ సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు జీతాలుగా ఇస్తున్నాడన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. 


కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌, జూపూడి రంగరాజు, బిట్రా శివన్నారాయణ, లక్ష్మీపతిరాజా, కేశవ్‌కాంత్‌, ప్రేమ్‌కుమార్‌, చక్రవర్తి, హర్షవర్ధన్‌, బేబీ రాణి, కట్టా పద్మ, ఝాన్సీ రాణి, విజయలక్ష్మి, జయలక్ష్మి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-08T05:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising