Big Shok to Ambati: రాజుపాలెంలో మంత్రి అంబటికి నిరసన సెగ
ABN, First Publish Date - 2022-08-01T20:12:09+05:30
రాజుపాలెంలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు నిరసన సెగ తగిలింది.
పల్నాడు జిల్లా (Palnadu): రాజుపాలెంలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు నిరసన సెగ తగిలింది. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో అంబటిని మహిళలు (Womens) నిలదీశారు. సంక్షేమ పధకాలు (Schemes), పించన్ (Pensions)లు రావటంలేదని మంత్రిని నిలదీశారు. మూడేళ్ల తర్వాత గుర్తుకు వచ్చామా? అంటూ ఆగ్రహించారు. మహిళల ఆగ్రహంతో మంత్రి అంబటి, పార్టీ నాయకులు వెళ్లిపోయారు.
మంత్రి అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో రాజుపాలెంకు వెళ్లిన మంత్రిని సమస్యలపై మహిళలు, గ్రామస్తులు నిలదీశారు. గెలిచి మూడేళ్లు అయినా తమ సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయిన అంబటి ఎదురుదాడి మొదలుపెట్టారు. నిలదీసిన ప్రజలపై తిట్ల దండకం అందుకున్నారు. అయితే ప్రజలు తిరగబడడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మూడేళ్లలో ఏం సాధించారో అన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి అంబటి ఏం సమాధానం చెప్పారో ఈ వీడియో చూడండి...
Updated Date - 2022-08-01T20:12:09+05:30 IST