AP News: చెన్నుపాటి గాంధీని పరామర్శించిన లోకేష్
ABN, First Publish Date - 2022-09-06T23:46:27+05:30
Hyderabad: వైసీపీ రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పరామర్శించారు
Hyderabad: వైసీపీ రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పరామర్శించారు. దాడిలో కంటికి బలమైన గాయం కావడంతో చెన్నుపాటి గాంధీ ప్రస్తుతం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న లోకేష్ ఆస్పత్రికి చేరుకుని చెన్నుపాటి గాంధీతో మాట్లాడారు. అధైర్యపడొద్దని త్వరగా కోలుకుంటారని చెప్పారు. అన్నివిధాలా పార్టీ అండగా వుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం కంటికి జరుగుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
Updated Date - 2022-09-06T23:46:27+05:30 IST