AP News: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బెయిల్ మంజూరు
ABN, First Publish Date - 2022-09-16T23:09:34+05:30
Amaravathi: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత (Kottapalli Geeta)కు హైకోర్టు (High court) బెయిల్ మంజూరు చేసింది. ఆమె భర్త పి.రామకోటేశ్వర రావుకు కూడా బెయిల్ మంజూరు చేస్తూ.. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఓ సంస్థ
Amaravathi: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత (Kottapalli Geeta)కు హైకోర్టు (High court) బెయిల్ మంజూరు చేసింది. ఆమె భర్త పి.రామకోటేశ్వర రావుకు కూడా బెయిల్ మంజూరు చేస్తూ.. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఓ సంస్థ పేరుతో రూ.50 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గీతను సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీబీఐ కోర్టు కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేయడంతో సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ..తదుపరి విచారణ డిసెంబరు 16కి వాయిదా వేసింది.
Updated Date - 2022-09-16T23:09:34+05:30 IST