ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ఆదాయ వనరు అమరావతి

ABN, First Publish Date - 2022-09-21T05:48:20+05:30

న్యాయం చేయమంటే అక్రమకేసులు పెడుతున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 1008వ రోజుకు చేరుకున్నాయి.

మందడం శిబిరంలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1008వ రోజుకు రైతుల ఉద్యమం 

తుళ్లూరు, సెప్టెంబరు 20: న్యాయం చేయమంటే అక్రమకేసులు పెడుతున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 1008వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరం నుంచి వారు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధికి రూ.లక్ష కోట్లు అవసరం అవుతాయని సీఎం జగన్‌రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అమరావతి తనంతట తానుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి జరిగితే రాష్ట్ర ఆదాయ వనరుగా అమరావతి ఉంటుందన్నారు. మూడు రాజధానులంటూ అమరావతిని చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ సౌకర్యాలున్న అమరావతి రాజధానిపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని కోరారు. బిల్డ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. 


Updated Date - 2022-09-21T05:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising