ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి అభివృద్ధిపై కాలయాపన తగదు

ABN, First Publish Date - 2022-07-06T05:53:40+05:30

అమరావతి అభివృద్ధిపై కాలయాపన తగదని రాజధానికి భూములు త్యాగంచేసిన రైతులు పేర్కొన్నారు.

తుళ్ళూరు శిబిరంలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

931వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు 

తుళ్ళూరు, జూలై 5: అమరావతి అభివృద్ధిపై కాలయాపన తగదని రాజధానికి భూములు త్యాగంచేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 931వ రోజుకు చేరుకున్నాయి. ఈ  సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం 33వేల ఎకరాలు భూములు ఇస్తే వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. భూములు ఇవ్వటమే రైతులు చేసిన నేరమా అని ప్రశ్నించారు.  కాలయాపన చేయకుండా హైకోర్టు తీర్పును అమలు చేసి రాజధాని అమరావతి అభివృద్ధిని కొనసాగించాలన్నారు. ఇప్పటికైనా అమరావతి రాజధానిపై రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు. లేదంటే తగిన మూల్యం తప్పదన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి  బిల్డ్‌ అమరావతి, జై అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. 


Updated Date - 2022-07-06T05:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising