భవనాలను అలాగే వదిలేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం
ABN, First Publish Date - 2022-08-07T14:43:53+05:30
Amaravathi: అమరావతి రైతులు సుప్రీంకోర్టు (Supreme Court)లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో నిర్మాణం దాదాపు పూర్తయిన భవనాలను ప్రభుత్వం అలానే
- సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అమరావతి రైతులు
Amaravathi: అమరావతి రైతులు సుప్రీంకోర్టు (Supreme Court)లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో నిర్మాణం దాదాపు పూర్తయిన భవనాలను ప్రభుత్వం అలానే వదిలివేయటం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని రైతులు పిటిషన్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాలు 80 శాతం పూర్తయినా.. అలాగే వదిలేశారని, పేదల కోసం నిర్మించిన టిడ్కో (TIDCO) ఇళ్లను కూడా మంజూరు చేయకుండా జాప్యం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు బయట అద్దెకు ఉండటంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని, ఈ అంశాలపై హైకోర్టులో పిటిషన్లు వేసినా ఉత్తర్వులు రాలేదని పిటిషనర్లు పేర్కొన్నారు.
Updated Date - 2022-08-07T14:43:53+05:30 IST