గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో వైసీపీ అరాచకం
ABN, First Publish Date - 2022-02-09T23:28:08+05:30
గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో వైసీపీ అరాచకం
గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో వైసీపీ అరాచకం సృష్టించింది. భట్టిప్రోలు మండలం పల్లెకోనలో ముగ్గురు మహిళలు, పిల్లాడిపై దాడి చేశారు. నడిరోడ్డుపై మహిళలపై వైసీపీ నేత నాంచారయ్య విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీసుకున్న అప్పు తిరిగి అడిగినందుకు దాడి చేశాడని బాధితులు తెలిపారు. నాంచారయ్య బెదిరింపులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాతే కక్ష గట్టి మరీ దాడి చేశాడని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2022-02-09T23:28:08+05:30 IST