ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనిధి కుటుంబాన్ని ఆదుకోవాలి: Alapati Raja

ABN, First Publish Date - 2022-07-18T00:51:02+05:30

తెనాలి మండలం కొలకలూరు దళితవాడలో మాజీ మంత్రి ఆలపాటి రాజా (Ex Minister Alapati Raja) పర్యటించారు. ఇటీవల నీటి కాలుష్యంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (Guntur): తెనాలి మండలం కొలకలూరు దళితవాడలో మాజీ మంత్రి ఆలపాటి రాజా (Ex Minister Alapati Raja) పర్యటించారు. ఇటీవల నీటి కాలుష్యం (Water Polution)తో మృతి చెందిన శ్రీనిధి (Srinidhi) కుటుంబాన్ని ఆయన పరామర్శించించారు. శ్రీనిధి కుటుంబానికి టీడీపీ (Tdp) తరఫున రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా  మాట్లాడుతూ శ్రీనిధి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం (Ap Government) ఇంతవరకు నష్టపరిహారం అందించలేదన్నారు.  శ్రీనిధి గత నెల 30న  చనిపోయిన కారణమేంటో ఇంతవరకు తెలిలేయదని వ్యాఖ్యానించారు. ప్రజలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనపడుతుందని విమర్శించారు. 16 రోజుల్లో 70 మంది ఆసుపత్రి (Hospital) పాలైతే ఇంత వరకు కారణమేంటో తేల్చలేకపోయారని మండిపడ్డారు. 


‘‘గ్రామంలో నీరు కలుషితం అవుతుందని ప్రజలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వ అసమర్థత వల్లే గ్రామంలో నీరు కాలుష్యం అయింది. పంచాయతీ, ఇరిగేషన్, కలెక్టర్ ప్రజలకి సమాధానం చెప్పాలి. త్వరితగతిన నివేదిక అందించి.. బాధితురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలి. లేని పక్షంలో టీడీపీ తరపున ఆందోళన చేపడతాం.’’ అని ఆలపాటి రాజా హెచ్చరించారు. 



Updated Date - 2022-07-18T00:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising