Guntur: తాడేపల్లి కరకట్టపై రైతుల ఆందోళన
ABN, First Publish Date - 2022-06-10T17:32:26+05:30
జిల్లాలోని తాడేపల్లి కరకట్టపై రైతులు ఆందోళనకు దిగారు.
గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి కరకట్టపై రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పచ్చని పొలాలను రోడ్డు కాంట్రాక్టర్ జేసీబీలతో తొక్కేస్తున్నాడు. దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే కరకట్ట అభివృధి పనులు మొదలు పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఎలా తమ పొలాల్లోకి జేసీబీలతో వస్తారని ప్రశ్నించారు. తక్షణమే రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు.
Updated Date - 2022-06-10T17:32:26+05:30 IST