శ్రీవారి సేవలో గవర్నర్
ABN, First Publish Date - 2022-10-04T07:49:40+05:30
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తిరుమల వేంకటేశ్వరస్వామిని సోమవారం దర్శించుకున్నారు.
తిరుమల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తిరుమల వేంకటేశ్వరస్వామిని సోమవారం దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లిన హరిచందన్ శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆయనకు అద్దాల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, చైర్మన్, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Updated Date - 2022-10-04T07:49:40+05:30 IST