సత్యసాయి జిల్లా ప్రమాదంపై Governor దిగ్భ్రాంతి
ABN, First Publish Date - 2022-06-30T15:23:55+05:30
సత్యసాయి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయవాడ: సత్యసాయి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(Bishwabhushan harichandan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి, దానిలో ప్రయాణిస్తున్న కూలీలు మృతి చెందడం విచారకరమని అన్నారు. జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సమాచారం తీసుకోవాలని రాజ్భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2022-06-30T15:23:55+05:30 IST