ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తశుద్ధిలేకే ప్రభుత్వ మెలిక: సూర్యనారాయణ

ABN, First Publish Date - 2022-01-29T01:20:50+05:30

చిత్తశుద్ధి లేని ప్రభుత్వం మెలికపెడుతోందని, ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: చిత్తశుద్ధి లేని ప్రభుత్వం మెలికపెడుతోందని, ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన కమిటీ సమస్యను పరిష్కరించే కమిటీ కాదన్నారు. పాత జీతాలే జనవరి నెలకు ఇవ్వాలని, అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఏవేవో మెలికలు పెడుతోందని, తమ జేఏసీలోని తొమ్మిది మందిని చర్చలకు పంపిస్తే చర్చలకు రాలేదంటూ మాట్లాడటం సబబుకాదన్నారు. మరోవైపు 2018-2019 మధ్య ఉన్న డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మామని, ఇప్పుడు లక్షల మంది ఉద్యోగుల మనోభావాలకు తగ్గట్లుగా అసలైన నాయకులుగా ఉద్యమంలో ఉన్నామని సూర్యనారాయణ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-29T01:20:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising