ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ABN, First Publish Date - 2022-01-31T23:20:59+05:30
తమ ఆదేశాలను పాటించని ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు
అమరావతి: తమ ఆదేశాలను పాటించని ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. పలువురు ట్రెజరీ అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. 27 మంది డీడీఓలు, ఎస్టీఓ, ఏటీఓలకు చార్జ్ మెమోలు జారీ చేసింది. ముగ్గురు డిప్యుటీ డైరెక్టర్లు, 21 మంది సబ్ ట్రెజరీ అధికారులు, ఇద్దరు ఏటీఓలకు మెమోలు జారీ అయ్యాయి. జీతాల బిల్లులు పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చార్జ్ మెమోలో ప్రభుత్వం పేర్కొంది.
Updated Date - 2022-01-31T23:20:59+05:30 IST