ప్రజలను సంతోషంగా చూడాలన్నదే ప్రభుత్వం లక్ష్యం: మంత్రి ఉషశ్రీ
ABN, First Publish Date - 2022-05-02T01:15:40+05:30
రాష్ట్రంలోని ప్రజలందరినీ సంతోషంగా చూడాలన్నదే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు.
తిరుమల: రాష్ట్రంలోని ప్రజలందరినీ సంతోషంగా చూడాలన్నదే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఆశీర్వాదంతో తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి, ఆశీస్సులు అందజేయాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోవు ఎన్నికల్లో కూడా జగన్మోహన్రెడ్డి మంచి మెజార్టీతో గెలవడాన్ని చూడబోతున్నామని జోస్యం ఉషశ్రీ చెప్పారు.
Updated Date - 2022-05-02T01:15:40+05:30 IST