ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Floods: మళ్లీ పెరుగుతున్న గోదావరి

ABN, First Publish Date - 2022-07-24T01:33:12+05:30

గోదావరి (Godavari) మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి భద్రాచలం వద్ద 41.90 అడుగులు నీటి మట్టం శనివారం సాయంత్రానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం: గోదావరి (Godavari) మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి భద్రాచలం వద్ద 41.90 అడుగులు నీటి మట్టం శనివారం సాయంత్రానికి నాలుగడుగులు పెరిగి 45.90 చేరుకుంది. తెలంగాణ (Telangana)లోని పలు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే వరద బాధితులు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మళ్లీ వరద పెరుగుతుందన్న సమాచారం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) ఎగువ కాపర్‌ డ్యామ్‌, స్పిల్‌ వే ఎగువన శనివారం ఉదయం 32.610 మీటర్లుగా ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 32.860 మీటర్లకు పెరిగింది. దిగువ కాపర్‌ డ్యామ్‌, స్పిల్‌ వే దిగువన 24.140 మీటర్లుగా ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 24.300 మీటర్లకు పెరిగింది. పోలవరం వద్ద 24.770 మీటర్లు నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న 7,45,063 క్యూసెక్కుల వరద జలాలను జలవనరులశాఖ అధికారులు దిగువకు విడుదల చేశారు.

Updated Date - 2022-07-24T01:33:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising