గోదావరిలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి
ABN, First Publish Date - 2022-03-21T02:29:11+05:30
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక వద్ద గోదావరిలో మునిగి ఇద్దరు విద్యార్థులు ఆదివారం మృతి చెందారు.
ఆలమూరు: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక వద్ద గోదావరిలో మునిగి ఇద్దరు విద్యార్థులు ఆదివారం మృతి చెందారు. మండలంలోని చెముడులంక జడ్పీ హైస్కూల్లో చదువుతున్న చెముడులంకకు చెందిన రొక్కాల రోహిత్(14), హెచ్.రాహుల్(14)తోపాటు చొప్పెల్ల గ్రామానికి చెందిన వినయ్కౌషిక్లు బడుగువానిలంక వద్ద గోదావరి నదీపాయలో స్నానానికి దిగారు. గోదావరిలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పటీకీ గోదావరిలో ఉన్న ఊబిని గుర్తించపోవడంతో రోహిత్, రాహుల్లు ఊబిలో కూరుకుపోయ్యారు. వినయ్ రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మృత్యువాత పడారు. ఈ ఘటనపై ఆలమూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-03-21T02:29:11+05:30 IST