జీవో 217ను రద్దు చేయాలి: కొల్లు రవీంద్ర
ABN, First Publish Date - 2022-03-12T22:18:55+05:30
మత్స్యకారులకు నష్టం చేసే జీవో 217ను రద్దు చేయాలని
నెల్లూరు: మత్స్యకారులకు నష్టం చేసే జీవో 217ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. నగరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మత్స్యకారుల పొట్టకొట్టే విధంగా సీఎం జగన్ జీవో 217 తీసుకురావడం దుర్మార్గమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. చెరువులలో సంపదను దళారులకి దోచిపెట్టే విధంగా జగన్ జీవో తెచ్చారని ఆయన ఆరోపించారు.
Updated Date - 2022-03-12T22:18:55+05:30 IST