జీవో 270ను రద్దు చేయాలి: కొల్లు రవీంద్ర
ABN, First Publish Date - 2022-03-17T17:05:13+05:30
రాష్ట్ర ప్రభుత్వం మత్యకారుల జీవన విధానాన్ని ఒక జీవోతో నాశనం చేయటానికి పూనుకున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మత్యకారుల జీవన విధానాన్ని ఒక జీవోతో నాశనం చేయటానికి పూనుకున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చెరువులు సాగు చేసుకుని లక్షల మంది మత్యకారులు బ్రతుకుతున్నారని తెలిపారు. జీవో 217 ద్వారా మత్యకారుల బ్రతుకులు చిన్నాభిన్నం చేసి బిచ్చగాళ్లగా మార్చుతున్నారని మండిపడ్డారు. కేవలం ఇది ఒక పైలెట్ ప్రాజెక్ట్గా చూడాలని, దీని ద్వారా మేలు జరుగుతుంది అని చెబుతున్నారని..ప్రజలను మోసం చెయ్యటానికి పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 270 రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
Updated Date - 2022-03-17T17:05:13+05:30 IST