ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంపెల్లి ప్రమాద ఘటనపై జవహర్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-07-22T19:28:55+05:30

సొంపెల్లి ప్రమాద ఘటనలో పెద్ద కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని టీడీపీ మాజీ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: సొంపెల్లి ప్రమాద ఘటనలో పెద్ద కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని టీడీపీ మాజీ మంత్రి జవహర్(Jawahar) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రమాదానికి ముందే విజయసాయిరెడ్డి(Vijayasaireddy) ట్వీట్ పెట్టడం అనుమానం కలిగిస్తోందని అన్నారు. సంఘటన జరగబోతుందని.. ఆ సంఘటనకు తమరు బలవుతారని ఏ విధంగా అన్నారని ప్రశ్నించారు. ‘‘ఆ ఘోరం జరుగుతుందని ముందే ఊహించారా.. లేక ఉద్దేశ్య పూర్వకంగా మీరే చేయించారా’’ అని అన్నారు. కర్మపాపం ఏదైనా ఉందంటే పాపులకు లేదా జగన్‌కు కర్మపాపం ఉంటుందన్నారు. అలిపిరి తరువాత చంద్రబాబుకు రెండో ఘటన జరిగిందని.. దేవుడు ఆయన పక్షాన ఉన్నారని ఆయన తెలిపారు. విజయసాయి లాంటి కుక్కలు మొరిగితే చంద్రబాబుకి ఏమి కాదని వ్యాఖ్యలు చేశారు. విజయసాయి మొరగడం మానేసి వరద బాధితులకు ఏవిధంగా సహాయం చేయాలో ఆలోచిస్తే మంచిదని హితవుపలికారు. ఆఖరిగా చంద్రబాబును, టీడీపీ నేతలను అంతమొందించే కుట్ర అస్త్రాలు సిద్ధం చేస్తున్నారన్నారు. ప్రజల అండ ఉన్నంతవరకు చంద్రబాబుని ఏమి చేయలేరని జవహర్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-22T19:28:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising