పంట విరామం జగన్ పాలనా పాపమే: Jawahar
ABN, First Publish Date - 2022-06-11T15:04:55+05:30
ఏరువాక సమయంలో పంట విరామం జగన్ పాలనా పాపమే అని మాజీ మంత్రి జవహర్ అన్నారు.
అమరావతి: ఏరువాక సమయంలో పంట విరామం జగన్ పాలనా పాపమే అని మాజీ మంత్రి జవహర్ (Jawahar) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ధాన్యం డబ్బులు నేటికి రైతు ఖాతాలోకి జమ కాలేదని తెలిపారు. వ్యవసాయ ప్రోత్సాహకాలు ప్రచారానికి పరిమితమయ్యాయన్నారు. పంట బోదెల పూడికకు చర్యలు శూన్యమని విరుచుకుపడ్డారు. నీటి తీరువా ప్రణాళిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుకు భరోసా లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. పాడి పంటలు జగన్ పాలనలో కుధేలవుతున్నాయన్నారు. వ్యవసాయం అంటేనే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. పుండు మీద కారం లా మోటర్లకు మీటర్లు అని... ఏ ప్రయోజనాల కోసం మీటర్లు పెడుతున్నారో చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.
Updated Date - 2022-06-11T15:04:55+05:30 IST