ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నువ్వు దీవించేది ఏంది...నీ అర్హత ఏమి..జగన్’

ABN, First Publish Date - 2022-05-28T16:27:35+05:30

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం అంబేద్కర్‌ను అవమానిస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం అంబేద్కర్‌(Ambedkar)ను అవమానిస్తోందని  కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్(Chinta mohan) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అంబేద్కర్ ఒక జిల్లాకు పరిమితమైన వ్యక్తి కాదని... ప్రపంచ మేధావి అని తెలిపారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నానని... కులాల మధ్య చిచ్చుకు కుట్ర ఇది అని మండిపడ్డారు. పేద కాలనీలకు అంబేద్కర్ పేరు పెట్టడం వెనుక ప్రేమ ఉంటుందని ఆయన తెలిపారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం వెనుక రాజకీయ స్వార్థం ఉందని విమర్శించారు. సామాజిక న్యాయం పేరుతో అన్యాయం చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల స్కాలర్షిప్‌ను పూర్తిగా తీసేయటం సామాజిక అన్యాయమని వ్యాఖ్యానించారు.  ‘‘మాకు వచ్చేదానికి నీ దీవెన పేరు ఏంది జగన్? నువ్వు చదివింది ఏమి? నువ్వు దీవించేది ఏంది? నీకు అర్హత ఏమి?’’ అంటూ చింతా మోహన్ ప్రశ్నించారు. 

Updated Date - 2022-05-28T16:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising