కేటీఆర్ వ్యాఖ్యలపై అశోక్గజపతిరాజు స్పందన
ABN, First Publish Date - 2022-05-02T19:58:39+05:30
ఏపీ పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తనదైన శైలిలో స్పందించారు.
విజయనగరం: ఏపీ పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తనదైన శైలిలో స్పందించారు. ‘‘ఒక మంత్రి ఏమో జెనరేటర్లు ఆన్ చేశాం అంటారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏమో 14 నెలలు బిల్లు కట్టకపోవడంతోనే పవర్ కట్ చేసాం అంటారు. ఇదంతా ఎంటర్టైన్మెంట్కు పనికొస్తాది తప్పా ఇంకేం కాదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వైసీపీ ప్రభుత్వం మరిచిపోయింది. ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఇలా చేసేది కాదు. ప్రతిపక్ష నాయకులకు సమన్లు ఇస్తుంటే ఇంకేమైనా అర్ధం ఉందా. అసలు ఏమి జరిగుతుంది రాష్ట్రంలో. సమస్య తగ్గే విధంగా ఎక్కడైనా కృషి చేస్తున్నారా?’’ అంటూ అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు.
Updated Date - 2022-05-02T19:58:39+05:30 IST