ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాయుడుపేట టీడీపీ కార్యాలయానికి నిప్పు

ABN, First Publish Date - 2022-05-24T08:58:22+05:30

నాయుడుపేట టీడీపీ కార్యాలయానికి నిప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన దుండగులు

నాయుడుపేట, మే 23: తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసి నిప్పంటించారు. టీడీపీ నాయకుడు గంగబాబు కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి కార్యాలయాన్ని మూసివేసి బయట వరండాలో ఆయన కూర్చుని ఉండగా మోటారు సైకిల్‌పై ముగ్గురు యువకులు వచ్చి దుర్భాషలాడారు. కొంత సమయం తర్వాత ఆయన బస్టాండ్‌ ప్రాంతంలోకి వెళ్లగా టీడీపీ కార్యాలయానికి  నిప్పంటించి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని గంగబాబుకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు.  దీంతో తాను పోలీసులకు సమాచారం అందించి స్థానికుల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినట్టు వివరించారు. ఆ యువకులు అక్కడి నుంచి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-24T08:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising