కన్నతండ్రిని నరికి చంపిన తనయుడు
ABN, First Publish Date - 2022-06-25T17:38:58+05:30
ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరులో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా
Nandyal : ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరులో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగా తండ్రి నారాయణను.. తనయుడు నవీన్ కుమార్ గొడ్డలితో నరికి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Updated Date - 2022-06-25T17:38:58+05:30 IST