YCP MLA ముస్తఫా తీరుపై రైతుల ఆగ్రహం
ABN, First Publish Date - 2022-07-28T17:19:23+05:30
వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా తీరు పట్ల స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు: వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) ముస్తఫా (Mustafa) తీరు పట్ల స్థానిక రైతులు (Farmer) ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పొలాల సమస్యలు పరిష్కారం కోరుతూ రైతులు రిలే నిరహార దీక్ష లు చేపట్టారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంకు ఎమ్మెల్యే ముస్తఫా.. రైతుల వైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. ఓట్లు వేసి గెలిపించిన రైతులు బాధల్లో ఉంటే ఎమ్మెల్యే మొహం చాటేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే ముస్తఫాకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ దీక్షలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
Updated Date - 2022-07-28T17:19:23+05:30 IST