అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-08-09T10:30:12+05:30
అప్పుల బాధ తాళలేక నంద్యాల జిల్లాలో సోమవారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆళ్లగడ్డ, ఆగస్టు 8: అప్పుల బాధ తాళలేక నంద్యాల జిల్లాలో సోమవారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆళ్లగడ్డ ఎంవీ నగర్కు చెందిన నరేష్ (31) తనకున్న మూడు ఎకరాల్లో మూడేళ్లుగా సీడు పత్తి సాగు చేస్తున్నాడు. దిగుబడులు రాక.. పెట్టుబడుల కోసం చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ తిమ్మయ్య తెలిపారు.
Updated Date - 2022-08-09T10:30:12+05:30 IST