జ్వరంతో బాధపడుతున్న విద్యార్థిపై లెక్కల మాస్టర్ ప్రతాపం.. తలను డెస్కుకు వేసి బాదడంతో కోమాలోకి..!
ABN, First Publish Date - 2022-02-15T12:21:19+05:30
జ్వరంతో బాధపడుతున్న ఓ విద్యార్థిని లెక్కల మాస్టర్ తీవ్రంగా కొట్టడంతో
- ఆలస్యంగా వెలుగులోకి ఘటన
చిత్తూరు జిల్లా/పలమనేరు : జ్వరంతో బాధపడుతున్న ఓ విద్యార్థిని లెక్కల మాస్టర్ తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పలమనేరు మండలం జరావారిపల్లెకు చెందిన రోహిత్ కుప్పం రహ దారిలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. వారం క్రితం పాఠశాలకు వెళ్లిన రోహిత్కు జ్వరం రావడంతో తరగతి గదిలో వెనుక వైపు ఉన్న డెస్కుపై పడుకొన్నాడు. లెక్కల మాస్టర్ జ్యోతీశ్వర్ గమనించి దగ్గరకు పిలిచారు. రోహిత్ ఒంటిని తాకి జ్వరం లేదు తప్పు చెబుతావా అంటూ..? ఆ విద్యార్థి తలను వంచి టేబుల్పైకి కొట్టడంతో పాటు, వెనుకవైపు మళ్లీ తలపై కొట్టారు.
దీంతో రోహిత్ ఇంటికి వెళ్లి పడకేశాడు. మంగళవారం మళ్లీ జ్యరం రావడంతో పాటు కాళ్లూచేతులు పనిచేయకపోవడంతో పలమ నేరులోని ఓ క్లినిక్లో తల్లిదండ్రులు చూపించారు. స్విమ్స్కు తీసుకెళ్లాలని సూచించడంతో రోహిత్ను స్విమ్స్లో చేర్పించారు. ఆదివారం వరకు కూడా రోహిత్ కోలుకోక పోవడంతో గ్రామస్థులు, రోహిత్ బంధువులు పాఠశాల వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్ధి వైద్యపరీక్షలకయ్యే వ్యయా న్ని భరిస్తామని,జ్యోతీశ్వర్ను సస్పెండ్ చేశామని చెప్పి సర్ది చెప్పారు.
Updated Date - 2022-02-15T12:21:19+05:30 IST