Indrakeeladriలో భారీగా ఉద్యోగుల బదిలీలు
ABN, First Publish Date - 2022-07-01T17:23:24+05:30
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్ర కీలాద్రిలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి.
Vijayawada : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్ర కీలాద్రి(Indrakeeladri)లో భారీగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. దుర్గగుడిలో జూనియర్ అసిస్టెంట్ నుంచి ఏఈవో స్థాయి వరకూ 36 మంది బదిలీ అయ్యారు. జాబితాలో ఆలయ పరిధిలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారున్నారు. అనారోగ్య కారణాలు, ఉద్యోగ విరమణ సమయం ఏడాది లోపు ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది. ఏఈవో, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉద్యోగులతోపాటు ఇంజినీరింగ్ విభాగంలో డీఈ, ఏఈ క్యాడరు ఉద్యోగులను బదిలీ చేస్తూ దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చింది.
Updated Date - 2022-07-01T17:23:24+05:30 IST