ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాల పునర్విభజనలో నష్టపోయేది ఉద్యోగులే: బొప్పరాజు

ABN, First Publish Date - 2022-03-13T01:34:13+05:30

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో నష్టపోయేది ఉద్యోగులేనని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో నష్టపోయేది ఉద్యోగులేనని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులో వారు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన, జిల్లా విభజనలు జరిగినపుడు ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగులేనని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే 13 జిల్లాల ఏర్పాటును తాము కూడా స్వాగతిస్తున్నామని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఉద్యోగ సంఘాలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తహశీల్దార్‌ ఆఫీసు నిర్వహణ ఖర్చులకు చిల్లిగవ్వలేదని ఆరోపించారు. మౌళిక సదుపాయాలు అసలే లేవని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ ఆఫీస్‌లో విద్యుత్ నిలిపివేస్తామని ఇప్పటికే విద్యుత్‌శాఖ నోటీసులు ఇస్తోందన్నారు. ప్రభుత్వం బిల్లులను మాఫీ చేయాలని లేదా చెల్లించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.

Updated Date - 2022-03-13T01:34:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising