కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో Godavari వరద ఉధృతి
ABN, First Publish Date - 2022-07-14T16:20:30+05:30
జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఏలూరు: జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వేలేరుపాడు మండలంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఎడవెల్లి వద్ద ఎద్దు వాగు కాజ్వే పై ఇంకా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కుక్కునూరు మండలంలోని దాచారం, గోమ్ముగూడెం,బెస్తగూడెం, మద్దిగట్ల, లచ్చిగూడెం, రుద్రమకోట గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. దాదాపు 34 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద భయంతో మెరక ప్రాంతానికి నిర్వాసితులు తరలివెళ్తున్నారు. పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Updated Date - 2022-07-14T16:20:30+05:30 IST