AP News: అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం
ABN, First Publish Date - 2022-09-06T02:47:33+05:30
ఏలూరు జిల్లా (Eluru District) లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెం సచివాలయానికి పది నెలల నుంచి ఇంటి అద్దె చెల్లించలేదని యజమాని సోమవారం
చింతలపూడి: ఏలూరు జిల్లా (Eluru District) లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెం సచివాలయానికి పది నెలల నుంచి ఇంటి అద్దె చెల్లించలేదని యజమాని సోమవారం సచివాలయానికి తాళం వేశారు. కార్యాలయ సిబ్బంది బయట కూర్చోవాల్సి వచ్చింది. ఈ పంచాయతీ కొత్తగా ఏర్పడింది. గతంలో ఒక పాఠశాలలో నిర్వహిస్తుండగా పాఠశాల తెరవడంతో అద్దె ఇంట్లోకి మార్చారు. పది నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని తనకు అద్దె కావాలంటూ తాళం వేసింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో గ్రామ సర్పంచ్ రవీంద్రబాబు చొరవ చేసుకుని ఇంటి యజమానితో మాట్లాడి నాలుగు రోజుల గడువు కోరడంతో సచివాలయాన్ని తెరిచారు. సచివాలయ భవనాలు వేగంగా పూర్తి కాకపోవడం, అద్దె భవనాలకు సకాలంలో అద్దె చెల్లించకపోవడంతో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి .
Updated Date - 2022-09-06T02:47:33+05:30 IST