వైసీపీ పాలనలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు: దేవినేని
ABN, First Publish Date - 2022-02-19T23:58:52+05:30
వైసీపీ పాలనలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని టీడీపీ నేత దేవినేని ఉమా తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: వైసీపీ పాలనలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని టీడీపీ నేత దేవినేని ఉమా తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలపై రూ.11,600 కోట్ల భారం మోపారని దుయ్యబట్టారు. విద్యుత్ కోతలు ఉండవని చెప్పి రైతులను మోసం చేశారని విమర్శించారు. పక్క రాష్ట్రం నుంచి రూ.5 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందన్నారు. యూనిట్ ఎంతకి కొంటున్నారో, ఎంతకిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రూ అప్ చార్జీలను పూర్తిగా నిలుపుదల చేయాలని దేవినేని ఉమా కోరారు.
Updated Date - 2022-02-19T23:58:52+05:30 IST