ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ చార్జీలు తగ్గించేదాకా ఉద్యమం: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2022-04-07T01:04:28+05:30

విద్యుత్‌ చార్జీలు తగ్గించేదాకా పోరాటం సాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: విద్యుత్‌ చార్జీలు తగ్గించేదాకా పోరాటం సాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ బుధవారం నిరసన తెలిపింది. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను లూఠీ చేస్తోందని విమర్శించారు. విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని కోరారు. రైతుల కోసం, ప్రజల కోసం ఉద్యమం చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. అతిపెద్ద విద్యుత్‌ ఉద్యమం నడిపిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఉందని గుర్తు చేశారు. అరెస్టులు తమ పార్టీకి కొత్త కాదని, చార్జీలను తగ్గించేదాకా పోరాటం చేస్తామని శైలజానాథ్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-04-07T01:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising