East Godavari: 300 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు
ABN, First Publish Date - 2022-05-16T17:13:15+05:30
భూపతిపాలెం జలాశయం దగ్గర పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. స్మగ్లర్లు ఏవోబీ నుంచి గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు
తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్లో గంజాయి రవాణా ముఠా కలకలం రేపుతోంది. ఏవోబీ నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో స్మగ్లర్లు భూపతిపాలెం జలాశయం దగ్గర స్కార్పియోను వదిలి పరారయ్యారు. కారులో సుమారుగా 300 కిలోల గంజాయిని రంపచోడవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Updated Date - 2022-05-16T17:13:15+05:30 IST