గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తాం మంత్రి విశ్వరూప్
ABN, First Publish Date - 2022-06-26T07:10:35+05:30
రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పి స్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వ రూప్ అన్నారు.
అల్లవరం, జూన్ 25: రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పి స్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వ రూప్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అమలాపురం ఎంపీ చింతా అను రాధ అన్నారు. మొగళ్లమూరిలో రూ.28 లక్షలతో నిర్మించే మంచినీటి ఓవర్హెడ్ ట్యాంకు, రూ.21.80 లక్షలతో నిర్మించే రైతుభరోసా భవన నిర్మాణాలకు మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధలు శంకుస్థాప నలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. బోడసకుర్రులో రూ.28 లక్షలతో నిర్మించే మంచినీటి ఓవర్హెడ్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ఎటువంటి సమస్యా లేకుండా ఆదర్శకాలనీలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్య క్రమంలో ఎంపీపీ యిళ్ల శేషగిరిరావు, జడ్పీటీసీ కొనుకు గౌతమి, ఆర్డబ్ల్యుఎస్ డీఈఈ పార్థసారఽథి, ఎంపీడీవో జీవీ సరోవరరావు, తహశీల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్, కొనుకు బాపూజీ, తిక్కా ప్రసాద్, సర్పంచ్లు రాయుడు విష్ణుత్రి మూర్తులు, రొక్కాల విజయలక్ష్మి, సాధనాల వెంకట్రావు, కడలి గంగాచలం, వడ్డి సుభాషిణి, రాకాపు విజయలక్ష్మి, సుందరనీడి సాయికృష్ణ, వైస్ ఎంపీపీలు ముత్యాల రామకృష్ణ, వడ్డి గంగ, మండల వ్యవసాయాధికారి నందెపు వీరవెంకటసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-26T07:10:35+05:30 IST