ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రావెల్స్‌ బస్సు బోల్తా

ABN, First Publish Date - 2022-08-18T06:29:24+05:30

ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురికి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ అయ్యప్పరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. ఆరెంజ్‌ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి మంగళవారం 30 మంది ప్రయాణికులతో రాజమహేంద్రవరం బయలుదేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ముగ్గురికి తీవ్రగాయాలు
 15 మందికి స్వల్పగాయాలు

నల్లజర్ల, ఆగస్టు 17: ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురికి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ అయ్యప్పరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. ఆరెంజ్‌ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి మంగళవారం 30 మంది ప్రయాణికులతో రాజమహేంద్రవరం బయలుదేరింది. నల్లజర్ల ప్రియాంకా ఫంక్షన్‌ హాల్‌ వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అతివేగం వల్ల అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 15మందికి స్వల్ప గాయాలు కాగా, ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ అయ్యప్పరెడ్డి తన సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వారి లగేజీని భద్రపర్చి వారి బంధువులకు అప్పగించారు. బోల్తా పడిన బస్సును క్రేన్‌ సహాయంతో తొలగించి వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.  ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అయ్యప్పరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-08-18T06:29:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising