ఉపాధ్యాయుల హాజరు తప్పనిసరి : ఆర్జేడీ
ABN, First Publish Date - 2022-08-17T06:53:18+05:30
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరును ఎస్ఐఎంఎ్స (సిమ్స్) యాప్లోనే ఆన్లైన్లో మాత్రమే నమోదుచేయాలని ఆర్జేడీ మధుసూదనరావు అన్నారు.
కాకినాడ రూరల్, ఆగస్టు 16: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరును ఎస్ఐఎంఎ్స (సిమ్స్) యాప్లోనే ఆన్లైన్లో మాత్రమే నమోదుచేయాలని ఆర్జేడీ మధుసూదనరావు అన్నారు. ఈ విధానాన్ని మంగళవారం నుంచే ప్రారంభించడంతో సర్పవరంలోని రెండు ఉన్నత పాఠశాలలను, ఏపీఎస్పీలోని ప్రాఽథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటలలోపు ఈ యాప్లో హాజరునమోదు చేయకపోతే రోజులో ఒకపూట సెలవుగా పరిగణిస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు యాప్లోనే హాజరు వేయాల్సి ఉంటుందని, ఎక్కడపడితే అక్కడ హాజరు వేసుకుంటే సంబంధిత ఉన్నతాధికారులకు వెంటనే జీపీఎస్ విధానం ద్వారా సమాచారం చేరుతుందన్నారు. మ్యాన్యువల్ అటెండెన్స్ ఇక మీదట వర్తించదని సర్వర్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. సర్పవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు ఎన్సీసీ ధ్రువపత్రాలను అందజేశారు.
Updated Date - 2022-08-17T06:53:18+05:30 IST