ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Gorantla: రౌడీ.. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు...

ABN, First Publish Date - 2022-12-06T15:22:02+05:30

సీఎం జగన్ (CM Jagan) వేధింపులు తట్టుకోలేక ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Choudhary) ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: సీఎం జగన్ (CM Jagan) వేధింపులు తట్టుకోలేక ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Choudhary) ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారని విమర్శించారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చేస్తున్న పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రౌడీ.. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని, ఆ మంత్రికి రౌడీ బాష తప్పా పోలవరం (Polavaram)పై అవగాహన లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రికి కూడా పోలవరంపై అవగాహన లేదని విమర్శించారు. పోలవరాన్ని చూడకుండా చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్ అవినీతి దాహానికి అంతులేకుండా పోతుందని, గతంలో దోచుకున్నదాని కంటే మూడు రెట్లు దోచుకుంటున్నారని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు. కోడికత్తి డ్రామా (Kodikatti Drama) ఆడారని, రాష్ట్రంలో రోడ్లన్ని గోతులమయంగా తయారయ్యాయన్నారు. ప్రభుత్వం డొక్కు బస్సులు ఇచ్చినా డ్రైవర్లు ప్రయాణికులను

సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలు వన్ సైడ్ వార్‌గా ఉంటుందని, టీడీపీ అన్ని స్థానాల్లో స్వీప్ చేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీరుతో దగాపడిన వారంతా చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని, ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

Updated Date - 2022-12-06T15:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising