అసలు నిందితులను వదిలి అమాయకులపై కేసులా!
ABN, First Publish Date - 2022-01-22T05:35:33+05:30
పుష్కర కాలువను ధ్వంసం చేసిన విషయంలో అసలు వారిపై కాకుండా అమాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట,
జనవరి 21: పుష్కర కాలువను ధ్వంసం చేసిన విషయంలో అసలు వారిపై కాకుండా
అమాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ఇర్రిపాకలోని తన స్వగృహంలో శుక్రవారం ఆయన
మీడియాతో మాట్లాడారు. హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మికి అక్కడ పొలం ఉండటంతో
ఆమెపై కేసు పెట్టడం సరికాదన్నారు. తానే ఇదంతా చేశానని జగ్గంపేట ఎస్ఐ
దగ్గర అసలు వ్యక్తి ఒప్పుకున్నా కేసు నమోదు చేయకపోవడం విడ్డూరమన్నారు.
ఎమ్మెల్యే చంటిబాబు, తాను పరస్పరం సహకరించుకుని ఈ మట్టి తవ్వకాలు
జరిపించామని ఒక పుకారు షికారు చేస్తోందన్నారు. ఎమ్మెల్యేకు సంబంధం ఉందో
లేదో తెలియదు కానీ తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. తరలించిన మట్టిని ఎక్కడ
ఎందుకు ఉపయోగించారో విచారణ చేయాలని కలెక్టర్ను కోరారు.
Updated Date - 2022-01-22T05:35:33+05:30 IST