టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ల నియామకం
ABN, First Publish Date - 2022-11-29T01:17:04+05:30
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్లను నియమిస్తూ సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజ రాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ రూరల్ మండలం నుంచి కర్రి వెంకటరాజు, తాతపూడి రామకృష్ణ, దాయిన రాంప్రసాద్, సరిగె నాగహరినాధ్, మిరపల సూర్యప్రకాష్, కాకినాడ సిటీ(8 డివిజన్లు) నుంచి పేరాబత్తుల లోవరాజు
కాకినాడ సిటీ, నవంబరు 28: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్లను నియమిస్తూ సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజ రాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ రూరల్ మండలం నుంచి కర్రి వెంకటరాజు, తాతపూడి రామకృష్ణ, దాయిన రాంప్రసాద్, సరిగె నాగహరినాధ్, మిరపల సూర్యప్రకాష్, కాకినాడ సిటీ(8 డివిజన్లు) నుంచి పేరాబత్తుల లోవరాజు, కొల్లాబత్తుల అప్పారావు, కరప మండలం నుంచి దేవు వెంకటేశ్వరరరావు, గండి వెంకటేశ్వరరావు, పలివెల జానకిరామయ్యలను క్లస్టర్ ఇన్చార్జ్లుగా నియమించారు.
కోఆర్డినేటర్గా రాజు
జగ్గంపేట, నవంబరు 28: టీడీపీ గోకవరం మండలం మీడియా కో ఆర్డినేటర్గా కృష్ణునిపాలెం గ్రామానికి చెందిన కొంగరపు రాజుని నియమించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ రాజుకు నిమాయకపత్రాన్ని అందజేశారు.
Updated Date - 2022-11-29T01:17:05+05:30 IST