ట్యాబ్ల పంపిణీలో సొమ్మసిల్లిన విద్యార్థిని
ABN, First Publish Date - 2022-12-31T00:24:42+05:30
ట్యాబ్ల పంపిణీ ఆలస్యంగా కావడంతో ఎండలో నిరీక్షించిన విద్యార్థిని సొమ్మసిల్లి పడిన సంఘటన కొండెవరం వీఎన్ఆర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. ఉన్నత పాఠశాలలో 8వ తరగతికి సబం ధించి 126మంది బాలికలకు ట్యాబ్ల పంపిణీ నిర్వహించారు. ఉద యం
కొండెవరం (కొత్తపల్లి), డిసెంబరు 30: ట్యాబ్ల పంపిణీ ఆలస్యంగా కావడంతో ఎండలో నిరీక్షించిన విద్యార్థిని సొమ్మసిల్లి పడిన సంఘటన కొండెవరం వీఎన్ఆర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. ఉన్నత పాఠశాలలో 8వ తరగతికి సబం ధించి 126మంది బాలికలకు ట్యాబ్ల పంపిణీ నిర్వహించారు. ఉద యం 10.30గంటలకు జరిగే టాబ్ల పంపిణీ కార్యక్రమం కోసం విద్యార్థులను ఉదయం 9గంటలకే ఆరుబయట నిలబెట్టడంతో ఎండ తీవ్రతకు జె.స్రవంతి అనే 8వ తరగతి విద్యార్థిని సొమ్మసిల్లి కిందపడింది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే వరండాలోకి తరలించి సపర్యలు చేపట్టారు. అనంతరం ఆమె తల్లిదండ్రు లు ఆటోలో ఇంటికి తీసుకెవెళ్లారు. విద్యార్థినికి లోబీపీ వచ్చిందని వెంటనే చికిత్ప చేయించామని హెచ్ఎమ్ జాన్ తెలిపారు. ట్యాబ్ల పంపిణీలో ఉపాధ్యాయులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎండలో విద్యార్థులను నిలబెట్టడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2022-12-31T00:24:43+05:30 IST