ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేశవరం పోతురాజుచెరువులో మట్టి తవ్వకాల అడ్డగింపు

ABN, First Publish Date - 2022-05-16T06:50:34+05:30

కేశవరంలో వున్న గనిపోతురాజు మైనర్‌ ఇరిగేషన్‌చెరువు(ట్యాంకు)లో మట్టి తవ్వకాలను స్థానిక రైతులు ఆదివారం అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మండపేట, మే 15:  కేశవరంలో వున్న గనిపోతురాజు మైనర్‌ ఇరిగేషన్‌చెరువు(ట్యాంకు)లో మట్టి తవ్వకాలను స్థానిక రైతులు ఆదివారం అడ్డుకున్నారు. ఈచెరువులో పూడిక మట్టి తీసేందుకు ఇద్దరకి ఆ శాఖ అనుమతులు మంజూరు చేసింది. అయితే క్యూబిక్‌మీటరు మట్టి ధర రూ.1గా నిర్ణయించారు. చెరువులో మట్టి పూడిక తీత ముసుగులో మట్టిని ఎక్స్‌కవేటర్లతో పెద్ద లారీల్లో ఇటుకలు బట్టీలు, నర్సరీలు, లేఅవుట్లకు తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చెరువు మట్టి తీయడం వల్ల తమ పొలాలకు ఇబ్బంది అవుతుందని, తవ్వకాలకు సంబంధించిన అనుమతి పత్రాలు చూపాలని ఒక వర్గం వారు డిమాండ్‌ చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది. మండపేట రూరల్‌ ఎస్‌ఐ శివకృష్ణ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఇరువర్గాలను సముదాయించి  పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో మట్టి తవ్వకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.



Updated Date - 2022-05-16T06:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising