అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారు
ABN, First Publish Date - 2022-05-23T06:50:33+05:30
రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని తెలుగు రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు అన్నారు.
గంగవరం, మే 22: రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని తెలుగు రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు అన్నారు. గంగవరంలో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ ఉదంతంపై ముఖ్యమంత్రిగాని మంత్రిగాని ప్రకటనలు చేయకపోవడం శోచనీయమన్నారు. ఆమదాళబంద ఎంపీటీసీ పండా ఆదినారాయణ, మండల ప్రధాన కార్యదర్శి బానుప్రకాష్, టీడీపీ నాయకులు వీరబాబు, కృష్ణ, చినబాబు తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-05-23T06:50:33+05:30 IST