రాజమండ్రిలో Omicron కలకలం
ABN, First Publish Date - 2022-01-05T16:06:27+05:30
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఒమైక్రాన్ కలకలం రేగింది.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఒమైక్రాన్ కలకలం రేగింది. దివాన్ చెరువులో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరికి ఒమైక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కొత్తపేట మండలం అవిడి గ్రామానికి మస్కట్ నుంచి వచ్చిన మహిళ కూడా ఒమైక్రాన్ బారిన పడ్డారు. ముగ్గురు ఒమైక్రాన్ బాధితులు బయటపడటంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఒమైక్రాన్ బాధితుల కాంటాక్ట్లను గుర్తించి కొవిడ్ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated Date - 2022-01-05T16:06:27+05:30 IST