‘ప్రాజెక్టు పనులను స్థానిక కాంట్రాక్టర్లకే ఇప్పించాలి’
ABN, First Publish Date - 2022-02-19T05:48:03+05:30
సీలేరు ప్రాజెక్టు పరిధిలో నిర్వహించే సివిల్ ఓఅండ్ఎం పనులకు తమకే కల్పించాలని ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్కు స్థానిక కాంట్రాక్టర్లు శుక్రవారం విద్యుత్సౌదలో వినతిపత్రం అందజే శారు.
మోతుగూడెం, ఫిబ్రవరి 18: సీలేరు ప్రాజెక్టు పరిధిలో నిర్వహించే సివిల్ ఓఅండ్ఎం పనులకు తమకే కల్పించాలని ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్కు స్థానిక కాంట్రాక్టర్లు శుక్రవారం విద్యుత్సౌదలో వినతిపత్రం అందజేశారు. సీలేరు ప్రాజెక్టు నిర్మాణ సమయం నుంచి తామంతా ఇక్కడే స్థిరపడి సీలేరు కాంప్లెక్సులోని జెన్కో వారు కల్పించే వివిధ పనులను నిర్వహిస్తూ జీవనోపాధి సాగిస్తున్నామని, ఈ ప్రాంతలో కాంట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసు కున్న వారిలో గిరిజనులు, దళితులు, బలహీనవర్గాలకు చెందిన వారే అధికశా తం ఉన్నామని, ఇప్పటి వరకు జెన్కో వారి నియమ, నిబంధనలు ప్రకారమే పనులు నిర్వహిస్తూ వచ్చాయని ఆ లేఖలో తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో సీలేరు కాంట్రాక్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్హెచ్హెచ్ తిరుమల రావు, కార్యదర్శి బాలకోటయ్య, సభ్యులు టి.నాగేంద్రబాబు, సీహెచ్ శ్యామసన్, ఎస్.విజయకుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2022-02-19T05:48:03+05:30 IST